Telangana: తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జ‌డ్జీలు...కొలీజియం సిఫార‌సుల‌కు రాష్ట్రప‌తి ఆమోదం

  • ఇదివ‌ర‌కే ప్ర‌తిపాదించిన సుప్రీంకోర్టు కొలీజియం
  • రాష్ట్రప‌తి ఆమోదంతో కేంద్రం ఉత్త‌ర్వులు జారీ
  • త్వ‌ర‌లోనే హైకోర్టు న్యాయ‌మూర్తులుగా ప్ర‌మాణం చేయ‌నున్న జ‌డ్జీలు
president of india approves supreme court collegium proposals of 6 nes judges to telangana  high court

తెలంగాణ హైకోర్టుకు కొత్త‌గా ఆరుగురు న్యాయ‌మూర్తులు రానున్నారు. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని కొలీజియం ఇదివ‌ర‌కే ఆరుగురు జడ్జీల‌ను తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తులుగా ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు తాజాగా రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము శుక్ర‌వారం ఆమోద ముద్ర‌వేశారు.

దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ఆరుగురు కొత్త న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ఏనుగుల వెంక‌ట వేణుగోపాల్‌, న‌గేశ్ భీమ‌పాక‌, పుల్ల కార్తీక్‌, కాజా శ‌ర‌త్‌, జ‌గ్గ‌న్నగారి శ్రీనివాస‌రావు, నామ‌వ‌ర‌పు రాజేశ్వ‌ర‌రావులు ఉన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ తాజా ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో వీరు త్వ‌ర‌లోనే హైకోర్టు న్యాయ‌మూర్తులుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

More Telugu News