Telangana: తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జ‌డ్జీలు...కొలీజియం సిఫార‌సుల‌కు రాష్ట్రప‌తి ఆమోదం

president of india approves supreme court collegium proposals of 6 nes judges to telangana  high court
  • ఇదివ‌ర‌కే ప్ర‌తిపాదించిన సుప్రీంకోర్టు కొలీజియం
  • రాష్ట్రప‌తి ఆమోదంతో కేంద్రం ఉత్త‌ర్వులు జారీ
  • త్వ‌ర‌లోనే హైకోర్టు న్యాయ‌మూర్తులుగా ప్ర‌మాణం చేయ‌నున్న జ‌డ్జీలు
తెలంగాణ హైకోర్టుకు కొత్త‌గా ఆరుగురు న్యాయ‌మూర్తులు రానున్నారు. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని కొలీజియం ఇదివ‌ర‌కే ఆరుగురు జడ్జీల‌ను తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తులుగా ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు తాజాగా రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము శుక్ర‌వారం ఆమోద ముద్ర‌వేశారు.

దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ఆరుగురు కొత్త న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ఏనుగుల వెంక‌ట వేణుగోపాల్‌, న‌గేశ్ భీమ‌పాక‌, పుల్ల కార్తీక్‌, కాజా శ‌ర‌త్‌, జ‌గ్గ‌న్నగారి శ్రీనివాస‌రావు, నామ‌వ‌ర‌పు రాజేశ్వ‌ర‌రావులు ఉన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ తాజా ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో వీరు త్వ‌ర‌లోనే హైకోర్టు న్యాయ‌మూర్తులుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.
Telangana
TS High Court
Supreme Court
Justice N.V. Ramana

More Telugu News