Income tax: అటల్ పెన్షన్ యోజనలో పన్ను చెల్లింపుదారుల చేరికపై నిషేధం

  • నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్రం
  • అక్టోబర్ 1 నుంచి అమల్లోకి
  • కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్
  • పన్ను ఆదాయం ఉందని బయటపడితే ఖాతా క్లోజ్
Income tax payers cannot join this govt pension scheme from October

అటల్ పెన్షన్ యోజన పింఛను పథకంలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు చేరకుండా నిబంధనల్లో కేంద్ర సర్కారు మార్పులు చేసింది. 2022 అక్టోబర్ 1 నుంచి ఈ నూతన నిబంధన అమల్లోకి రానుంది. 

పన్ను చెల్లింపుదారులకు అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అర్హత ఉండదు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకవేళ అక్టోబర్ 1, ఆ తర్వాత అటల్ పెన్షన్ యోజనలో చేరిన వారికి, పన్ను వర్తించే ఆదాయం ఉందని గుర్తిస్తే.. వారి ఖాతాను మూసేసి, అప్పటి వరకు సమకూరిన మొత్తాన్ని వెనక్కిచ్చేయడం జరుగుతుందని తెలిపింది. 

అటల్ పెన్షన్ యోజనలో ఈ ఏడాది జూన్ 4 నాటికి 3.73 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. అటల్ పెన్షన్ యోజన అన్నది అసంఘటిత రంగంలోని వారికి పదవీ విరమణ అనంతరం ప్రతి నెలా పింఛను చెల్లించే పథకం. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఎవరైనా చేరొచ్చు. 18-40 ఏళ్ల వరకు చేరేందుకు అనుమతి ఉంటుంది. 60 ఏళ్ల వరకు ప్రతి నెలా కొంత మొత్తం జమ చేయాలి. ఆ తర్వాత నుంచి జీవించి ఉన్నంతకాలం రూ.1,000-5,000 మధ్య పెన్షన్ అందుకోవచ్చు.

More Telugu News