వెంకయ్యను కలిసి శుభాభినందనలు తెలిపిన విజయ సాయిరెడ్డి
- ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంకయ్య
- వెంకయ్యను స్వయంగా వెళ్లి కలిసిన సాయిరెడ్డి
- వెంకయ్య పనితీరును ఆకాశానికెత్తేసిన వైసీపీ ఎంపీ
రాజ్యసభలో క్రమశిక్షణను పాదుకొల్పడంలో వెంకయ్య సఫలీకృతం అయ్యారని సాయిరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో సభా సంఘాల పనీతీరును మెరుగు పరచడంతో పాటుగా రాజ్యసభలో అర్థవంతమైన చర్చలు జరిగేలా వెంకయ్య చేసిన కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.