కామన్వెల్త్ బ్యాడ్మింటన్ లో పురుషుల సింగిల్స్ స్వర్ణం కూడా మనదే... లక్ష్యసేన్ అద్భుత విజయం
- ఇప్పటికే మహిళల సింగిల్స్ స్వర్ణం నెగ్గిన సింధు
- పురుషుల సింగిల్స్ ఫైనల్లో పోరాడి నెగ్గిన లక్ష్యసేన్
- తొలి గేము కోల్పోయినా సడలని స్థైర్యం
- వరుసగా రెండు గేములు నెగ్గి స్వర్ణం సాధించిన వైనం
లక్ష్యసేన్ ఇవాళ జరిగిన ఫైనల్లో మలేషియాకు చెందిన ట్సే యోంగ్ ఎన్జీపై విజయం సాధించాడు. తొలి గేమ్ ను 19-21తో కోల్పోయిన లక్ష్యసేన్ ఆ తర్వాత విజృంభించాడు. వరుసగా 21-9, 21-16తో రెండు గేములు చేజిక్కించుకుని కామన్వెల్త్ క్రీడల్లో చిరస్మరణీయ విజయం సాధించాడు.