Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి నేడే ఘనంగా వీడ్కోలు పార్టీ

  • రాజ్యసభలో నేటి సాయంత్రం ఏర్పాటు
  • వెంకయ్యనాయుడికి మెమొంటో అందించనున్న ప్రధాని మోదీ
  • పదవీకాలం విశేషాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ
VP Venkaiah Naidu farewell today PM Modi to present memento

భారత ఉపరాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్యనాయుడి పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 11న నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కడ్ పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో పెద్దల సభ అయిన రాజ్యసభలో నేడు (సోమవారం) వెంకయ్యనాయుడికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. 

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక మెమొంటో ప్రదానం చేయనున్నారు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీ కాలానికి సంబంధించిన విశేషాలతో ఓ పుస్తకాన్ని కూడా ఇదే కార్యక్రమంలో ప్రధాని ఆవిష్కరించనున్నారు. నేటి రాత్రి ఫేర్ వెల్ డిన్నర్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యులు అందరూ హాజరుకానున్నారు.

More Telugu News