ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుపతికి వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం
- మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తున్న కుటుంబం
- కంభం సమీపంలో లారీని ఢీకొట్టిన కారు
- బాధితులది సిరిగిరిపాడుగా గుర్తింపు
కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55), ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24)గా గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.