Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీ... టీమిండియా భారీ స్కోరు

  • వెస్టిండీస్ తో ఐదో టీ20
  • ఫ్లోరిడాలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు
Team India registers huge total after Shreyas Iyer half century

వెస్టిండీస్ తో ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

ఓపెనర్ గా బరిలో దిగిన శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీతో రాణించాడు. అయ్యర్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేశాడు. దీపక్ హుడా 38, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. జాసన్ హోల్డర్ 1, డొమినిక్ డ్రేక్స్ 1, హేడెన్ వాల్ష్ 1 వికెట్ తీశారు.

More Telugu News