Nama Nageswar Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని కత్తితో బెదిరించి డబ్బు దోచుకున్న దుండగులు

  • జులై 31న చోటుచేసుకున్న ఘటన
  • కారులోకి ఎక్కి కత్తితో బెదిరించిన దుండగులు
  • రూ. 75 వేలు దోచుకున్న వైనం
Un known persons attacked Nama Nageswar Rao son

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు నామా పృథ్వి తేజను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి నిన్న రాత్రి ఆయన వ్యక్తిగత సిబ్బంది హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కారును ఆపి, అందులోకి ఎక్కిన దుండగులు... ఆయనను కత్తితో బెదిరించి రూ. 75 వేలు దోచుకున్నారు. 

ఈ ఘటన జులై 31న చోటు చేసుకోగా... నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు  నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆ మార్గంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగారా?  ఆయన వాహనాన్ని ఎవరైనా అనుసరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News