ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
- ఇటీవలే ఏడుగురు న్యాయమూర్తులను హైకోర్టుకు సిఫారసు చేసిన కొలీజియం
- కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ
కింది కోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఏడుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం రాష్ట్రపతికి లేఖ పంపిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యామ్ సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మినరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్న సంగతి తెలిసిందే.