Narayana Swamy: ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనంపై పరువునష్టం దావా వేస్తా: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

  • ఏపీలో బార్లకు వేలం
  • తనకు బినామీలు ఉన్నారని రాశారంటూ మండిపడిన డిప్యూటీ సీఎం  
  • దమ్ముంటే బినామీలు ఎవరో బయటపెట్టాలని సవాల్
  • రాధాకృష్ణ ఓర్వలేకపోతున్నాడని విమర్శలు
Deputy CM Narayana Swamy warns Andhrajyothy

ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి రాధాకృష్ణపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. రాధాకృష్ణ నీచపు బుద్ధి మానుకోవాలని అన్నారు. విజయవాడలో తనకు మద్యం షాపుల బినామీలు ఉన్నట్టు ఆంధ్రజ్యోతిలో రాశారని, ఆ తప్పుడు కథనంపై పరువునష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.  

ఏపీలో బార్లకు ఈ-వేలం ద్వారానే లైసెన్స్ లు పొందుతున్నారని, నిబంధనల ప్రకారం వేలం జరుగుతుంటే రాధాకృష్ణ ఓర్వలేక తప్పుడు రాతలు రాయిస్తున్నాడని నారాయణస్వామి ఆరోపించారు. తనపై ఆరోపణలు నిజమని ఆంధ్రజ్యోతి నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఆ బినామీలు ఎవరో బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు.

More Telugu News