Raj Nath Singh: మాజీ సైనికుల అనాథ పిల్లలకు నెలవారీ సాయం పెంపు: రాజ్‌నాథ్ సింగ్

  • ఇప్పటి వరకు నెలకు రూ. 1,000 సాయం
  • ఈ సాయాన్ని రూ. 3 వేలకు పెంపు 
  • 21 ఏళ్ల లోపు అవివాహిత పిల్లలు ఈ పథకానికి అర్హులు
Ex servicemen orphaned children fincial assistance increased

మాజీ సైనికుల అనాథ పిల్లలకు ఆర్థిక సాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున లభించేది. ఇకపై రూ. 3 వేల చెప్పున అందజేస్తారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలియజేశారు. 

రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాల పట్ల మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పెంచిన సాయంతో అనాథ పిల్లలు గౌరవప్రదంగా మెరుగైన జీవితాన్ని జీవించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఈ సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తారు. 21 సంవత్సరాల లోపు వయసున్న అవివాహిత కుమార్తె, కుమారుడు ఈ పథకానికి అర్హులు.

More Telugu News