Telangana: తెలంగాణలో ఇంకాస్త పెరిగిన కరోనా రోజువారీ కేసులు

  • గత 24 గంటల్లో 36,619 కరోనా పరీక్షలు
  • 795 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 343 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 658 మంది
  • ఇంకా 4,703 మందికి చికిత్స
Rise in Telangana corona cases

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో కొద్దిగా పెరుగుదల నమోదైంది. గడచిన 24 గంటల వ్యవధిలో 36,619 శాంపిల్స్ పరీక్షించగా, 795 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 343 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54, నల్గొండ జిల్లాలో 42, పెద్దపల్లి జిల్లాలో 33, ఖమ్మం జిల్లాలో 32 కేసులు గుర్తించారు. 

అదే సమయంలో 658 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,15,679 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,06,865 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,703 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది  మరణించారు.

More Telugu News