Telangana: మాజీ సర్పంచ్ మృత‌దేహాన్ని చూసి కంట‌త‌డి పెట్టిన తెలంగాణ స్పీక‌ర్ పోచారం

  • అనారోగ్యంతో మృతి చెందిన వ‌ర్ని మాజీ స‌ర్పంచ్ వెంక‌టేశ్వ‌ర‌రావు
  • నివాళి అర్పించేందుకు వెళ్లి భావోద్వేగానికి గురైన పోచారం
  • బాధితుడి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చిన స్పీకర్‌
ts assembly speaker pocharam srinivas reddy wipes out at his followers dead body

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి... త‌న అనుచ‌ర వ‌ర్గంలోని ఓ నేత మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. నిజామాబాద్ జిల్లాలోని వ‌ర్ని మండ‌ల కేంద్రానికి చెందిన మాజీ స‌ర్పంచ్ బండ్ల వెంక‌టేశ్వ‌ర‌రావు అనారోగ్య కార‌ణాల‌తో మంగ‌ళ‌వారం మృతి చెందారు. 

ఈ వార్త తెలిసిన వెంట‌నే ఆయ‌న ఇంటికి వెళ్లిన పోచారం... వెంక‌టేశ్వ‌ర‌రావు మృత‌దేహాన్ని చూసి భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న క‌న్నీళ్లు పెట్టుకున్నారు. అనంత‌రం త‌మాయించుకున్న పోచారం... వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఆది నుంచి పోచారం అడుగు జాడ‌ల్లోనే న‌డిచిన వెంక‌టేశ్వ‌ర‌రావు బోధ‌న్ సీడీసీ చైర్మ‌న్‌గానూ వ్య‌వ‌హ‌రించారు.

More Telugu News