రోడ్లు వేయకపోవడానికి కారణం ఇదే: ఏపీ మంత్రి జయరాం
- ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పాడయ్యాయన్న మంత్రి
- నిధులు లేక ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని వివరణ
- ఆగస్టులో రూ. 2 వేల కోట్లు వస్తాయని సీఎం చెప్పారన్న జయరాం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిధులు లేకపోవడం వల్లే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పాడయ్యాయని చెప్పారు. ఆగస్ట్ నెలలో రూ. 2 వేల కోట్లు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని... నిధులు రాగానే ఆగస్ట్ 15 తర్వాత రోడ్ల రిపేర్లకు సంబంధించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు వివరించారు.