చెత్త పారబోశారంటూ పంజాబ్ సీఎం ఇంటికి రూ.10 వేల జరిమానా
- చండీగఢ్ లో భగవంత్ మాన్ నివాసం వెలుపల చెత్త
- స్థానికుల నుంచి ఫిర్యాదులు
- పలుమార్లు హెచ్చరించిన మున్సిపల్ శాఖ
- భారీ జరిమానా వడ్డన
దీనిపై స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్ధు స్పందిస్తూ, సీఎం నివాసం నుంచి చెత్త పారబోస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. చెత్తను రోడ్డు మీద పారవేయొద్దని సీఎం నివాసంలోని వారికి మున్సిపల్ సిబ్బంది పలుమార్లు చెప్పినా ఫలితం కనిపించలేదని వివరించారు. ఈ క్రమంలోనే చలాన్ జారీ అయిందని వెల్లడించారు.