భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము... ఈసీ అధికారిక పత్రం ఇదిగో
- రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన ద్రౌపది ముర్ము
- యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో ముర్ము గెలుపు
- తాజాగా అధికారిక పత్రాన్ని విడుదల చేసిన ఎన్నికల సంఘం
తాజాగా శుక్రవారం రాత్రి రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ పత్రంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చాన్ పాండేలు సంతకాలు చేశారు. వారిద్దరే ముర్ము అధికారిక ఎన్నిక పత్రాన్ని విడుదల చేశారు.