అవినీతి కేసులో యడియూరప్పకు పెద్ద ఊరటను కలిగించిన సుప్రీంకోర్టు
- భూ కుంభకోణం కేసులో యెడ్డీకి ఊరట
- 2013లో నమోదైన అవినీతి కేసు
- క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టవద్దని సుప్రీం ఆదేశం
2013లో యడియూరప్పపై ఈ కేసు నమోదయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లందూర్, దేవరబీసనహల్లి తదితర ప్రాంతాల్లో ఐటీ పార్క్ కోసం 400 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అయితే ఈ భూమిలో కొన్ని భాగాలను ప్రైవేట్ ఓనర్లకు యెడ్డీ కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనపై అవినీతి ఆరోపణలతో కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టవద్దని ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశించడంతో 79 ఏళ్ల యడ్యూరప్పకు ఊరట లభించినట్టయింది.