Telangana: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కొత్త కేసులు

  • గత 24 గంటల్లో 35,094 కరోనా పరీక్షలు
  • 765 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 356 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 648 మంది
  • ఇంకా 4,609 మందికి చికిత్స
Telangana registers more corona positive cases

తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 35,094 కరోనా పరీక్షలు నిర్వహించగా, 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 356 కొత్త కేసులు గుర్తించారు. నల్గొండ జిల్లాలో 58, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56, ఖమ్మం జిల్లాలో 34 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 648 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,12,381 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,03,661 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,609 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.

More Telugu News