ఆసుపత్రిలో చేరిన పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​

Punjab CM Bhagwant Mann admitted to Delhi hospital
  • కడుపు నొప్పి కారణంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరిక
  • కడుపులో ఇన్ ఫెక్షన్ గుర్తించి చికిత్స అందిస్తున్న వైద్యులు
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆసుపత్రిలో చేరారు. కడుపు నొప్పి కారణంగా బుధవారం రాత్రి నుంచి ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు కడుపులో ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. రాష్ట్రంలోని ఇద్దరు గ్యాంగ్‌స్టర్లపై ఆపరేషన్‌ను విజయవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర పోలీసులను, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను పంజాబ్ సీఎం అంతకుముందు రోజు అభినందించారు. 

Go Back to Shorts
Punjab
AAP
cm
bhagwan mann
delhi
hospital

More Telugu News