Buddha Venkanna: ముంపు గ్రామాలకు చంద్రన్న వచ్చే వరకు ప్రభుత్వంలో చలనం లేదు: బుద్ధా వెంకన్న

Buddha Venkanna slams YCP Govt over Godavari floods
  • వరద ముంపునకు గురైన వందలాది గ్రామాలు
  • ఇప్పటికీ జలదిగ్బంధంలోనే పలు గ్రామాలు
  • ముంపు ప్రాంతాల్లో నేడు, రేపు చంద్రబాబు పర్యటన
  • విజన్ ఉన్న నాయకుడీకీ, లేనోడికీ తేడా అదేనన్న వెంకన్న

ఇటీవల గోదావరి వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాలోని రాజోలు, పి.గన్నవరం ప్రాంతాల్లో ఆయన బాధితులను కలుసుకోనున్నారు. ఈ మధ్యాహ్నం నాగుల్లంక నుంచి ఆయన పర్యటన షురూ కానుంది. 

ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ముంపు గ్రామాలకు చంద్రన్న వచ్చే వరకు ఈ ప్రభుత్వంలో చలనంలేదని విమర్శించారు. వరదలొస్తాయి అని వాతావరణ శాఖ ఎప్పుడో హెచ్చరించిందని, కానీ మునిగిపోయి నష్టం జరిగేదాకా ఈ ప్రభుత్వం చేతులు కట్టుకుని అలా చూస్తూ ఉందని ఆరోపించారు. విజన్ ఉన్న నాయకుడికి, లేనోడికీ తేడా అదేనని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News