Adivi sesh: పాన్ ఇండియా రేంజ్ లో 'గూఢచారి' సీక్వెల్!

  • 'మేజర్'తో హిట్ కొట్టిన అడివి శేష్ 
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'హిట్ 2'
  • శైలేశ్ కొలను రూపొందించిన సినిమా ఇది
  • ఫ్రాంచైజీగా రానున్న 'గూఢచారి 2'
Goodachari movie sequel update

అడివి శేష్ హీరోగా ఇటీవల వచ్చిన 'మేజర్' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'హిట్ 2' చేశాడు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా అలరించనుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

'క్షణం' .. 'గూఢచారి' .. 'మేజర్' వంటి సినిమాలను బట్టి చూస్తే, అడివి శేష్ ఒక ప్రత్యేకమైన జోనర్లో ముందుకు వెళుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ తరహా జోనర్లు సక్సెస్ ను కూడా తెచ్చిపెడుతుండటంతో ఆయన కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ  ప్రయత్నంలో భాగంగానే 'గూఢచారి 2'పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. 

అడివి శేష్ హీరోగా 2018 లో వచ్చిన 'గూఢచారి' భారీ విజయాన్ని నమోదు చేసింది. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఇదే టైటిల్ తో ఫ్రాంచైజీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట. మొత్తానికి అడివి శేష్ తనకంటూ ఒక జోనర్ ను సెట్ చేసుకున్నట్టే అనుకోవాలి.

More Telugu News