తూర్పు గోదావరిలో జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం
- రాజమహేంద్రవరం నుంచి పవన్ యాత్ర ప్రారంభం
- కౌలు రైతు శంకరం కుటుంబాన్ని పరామర్శించిన పవన్
- ఆత్మహత్య చేసుకున్న శంకరం ఫొటోకు నివాళి అర్పించిన వైనం
- బాధిత కుటుంబానికి రూ.1 లక్ష అందజేత
ఈ సందర్భంగా ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు పచ్చిమళ్ళ శంకరం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. శంకరం ఫొటోకు నివాళి అర్పించిన పవన్... ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో ప్రకటించిన రూ.1 లక్షను ఆయన బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.