ఎమ్మెల్సీ అనంతబాబుకు ఈ నెల 29 వరకు రిమాండ్ పొడిగింపు
- సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబు
- అధికార వైసీపీ నుంచి సస్పెండ్ అయిన వైనం
- రిమాండ్ను పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు ఆదేశాలు
ఈ ఘటనపై దళిత సంఘాలతో పాటు విపక్ష టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడంతో అనంతబాబును అధికార వైసీపీ అప్పటికప్పుడు సస్పెండ్ చేసింది. ఆపై ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా.... ప్రస్తుతం అనంతబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉంటున్నారు. గతంలో విధించిన జ్యూడిషియల్ రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఆయనను రాజమహేంద్రవరం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా అనంతబాబు రిమాండ్ను ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో తిరిగి అనంతబాబును పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్కు తరలించారు.