దేశంలో వరుసగా రెండో రోజు 20 వేల పైచిలుకు కరోనా కేసులు
- నిన్న 20,038 కేసుల నమోదు
- ఒక్క రోజులో 47 మంది మృతి
- కోలుకున్న వారు 16, 994 మంది
గత 24 గంటల వ్యవధిలో 16,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా మహమ్మారిని జయించారు. రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 47 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5, 25, 604కి చేరుకుంది. మరణాల శాతం 1.20 శాతంగా ఉంది.
ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 199,47,34,994 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న కొత్తగా 18,92,969 డోసులు అందజేశారు.