శ్రీలంక చేరుకోవాల్సిన 120కి పైగా విమానాలు కేరళలో ల్యాండింగ్

Sri Lanka bound planes takes technical landing at Kerala airports
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోగా, దేశంలో అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. ఈ నేపథ్యంలో, శ్రీలంక చేరుకోవాల్సిన 120కి పైగా విమానాలను కేరళకు మళ్లించారు. ఈ విమానాలు కేరళలోని తిరువనంతపురం, కొచ్చి ఎయిర్ పోర్టుల్లో ల్యాండయ్యాయి. 

దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. తిరువనంతపురం, కొచ్చి విమానాశ్రయాల సిబ్బందిని అభినందించారు. 120కి పైగా విమానాలను టెక్నికల్ ల్యాండింగ్ కు అనుమతించడం ద్వారా తమ విధులకు మించిన బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడారు. పొరుగుదేశంతో మన సంబంధాల బలోపేతానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని సింథియా అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Sri Lanka
Emergency
Planes
Trivandrum
Cochi
Kerala
India

More Telugu News