సూర్యకుమార్ మెరుపు శతకం వృథా... చివరి టీ20లో టీమిండియా ఓటమి
- నాటింగ్ హామ్ లో ఇంగ్లండ్ విజయం
- టీమిండియా టార్గెట్ 216 రన్స్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసిన టీమిండియా
- 55 బంతుల్లో 117 పరుగులు చేసిన సూర్యకుమార్
శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 11, కోహ్లీ 11 పరుగులు చేయగా, పంత్ (1), దినేశ్ కార్తీక్ (6), రవీంద్ర జడేజా (7) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే 3, డేవిడ్ విల్లీ 2, క్రిస్ జోర్డాన్ 2, గ్లీసన్ 1, మొయిన్ అలీ 1 వికెట్ తీశారు.
కాగా, ఇప్పటికే సిరీస్ ను టీమిండియా గెలుచుకున్న నేపథ్యంలో, ఈ విజయం ఇంగ్లండ్ కు ఊరట అని చెప్పాలి. ఇక ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జులై 12న ప్రారంభం కానుంది.