కర్ణాటకలో కుండపోత వర్షాలు... విద్యాసంస్థలకు సెలవులు
- కర్ణాటక కోస్తా జిల్లాలకు అత్యంత భారీ వర్షసూచన
- పరిస్థితి సమీక్షించిన సీఎం బసవరాజ్ బొమ్మై
- అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
- మంగళూరులో కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి
ఈ క్రమంలో ఉత్తర కన్నడ, కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా హెచ్చరికలు చేసింది. దాంతో, కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఐఎండీ ప్రకటన నేపథ్యంలో, సీఎం బసవరాజ్ బొమ్మై సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.