బోనాలకు వచ్చినంత జనం కూడా బీజేపీ సభకు రాలేదని మంత్రులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం: విజయశాంతి
- ఇటీవల బీజేపీ విజయ సంకల్ప సభ
- గ్రాండ్ సక్సెస్ అయిందన్న విజయశాంతి
- కేసీఆర్ అండ్ కో శునకానందం పొందుతున్నారని విమర్శలు
- తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా
కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రకటనలు ఏర్పాటు చేసుకుని వెకిలి ఆనందం పొందిందని విమర్శించారు. బోనాలకు వచ్చినంత జనం కూడా బీజేపీ సభకు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అని పేర్కొన్నారు. అసలు, పార్టీ మీటింగ్ ను బోనాలతో పోల్చడమేంటని విజయశాంతి ప్రశ్నించారు.
కేసీఆర్ బృందం మోదీని తిడుతూ అల్ప సంతోషాన్ని పొందుతోందని విమర్శించారు. మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, కానీ తెలంగాణలో ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు.