కేసీఆర్!.. జగన్ను చూసి నేర్చుకోండి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- సీఎంలందరూ ప్రధానిని గౌరవించాలన్న కేంద్రమంత్రి
- మోదీని ప్రజలు రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకున్నారని గుర్తు చేసిన ధర్మేంద్ర ప్రధాన్
- జగన్లానే సీఎంలందరూ మోదీని గౌరవించాలని సూచన
ఏపీకి వచ్చిన ప్రధానికి జగన్ ఎలాగైతే స్వాగతం పలికారో.. ఏ ముఖ్యమంత్రి అయినా అలాగే ప్రధానికి గౌరవం ఇవ్వాలని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్లకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.