ప్రధానిని స్వాగతించడానికి సీఎం కేసీఆర్ రాకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమే: కేంద్రమంతి స్మృతి ఇరానీ
- హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
- నగరానికి వచ్చిన ప్రధాని మోదీ
- మోదీకి స్వాగతం పలికిన తలసాని
- స్పందించిన స్మృతి ఇరానీ
"రాజ్యాంగ గౌరవాన్ని ఎవరు దెబ్బతీసినా వారు నియంతే అవుతారు... ఆ లెక్కన కేసీఆర్ కూడా నియంతే" అని పేర్కొన్నారు. అంతేకాదు, కేసీఆర్ ఉల్లంఘిస్తున్నది రాజ్యాంగపరమైన సంప్రదాయాలనే కాకుండా, సాంస్కృతికపరమైన సంప్రదాయాలను కూడా ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు.
"కేసీఆర్ కుటుంబానికి రాజకీయాలంటే ఓ సర్కస్ లా ఉన్నట్టుంది. కానీ రాజకీయాలంటే మాకు జాతీయ విధానం... అదొక మాధ్యమం. ఇవాళ తెలంగాణలో రాచరికపు పోకడలు కనిపిస్తున్నాయి. భారత్ లో ఇది ఎంతమాత్రం అనుసరణీయం కాదు" అంటూ స్మృతి ఇరానీ పేర్కొన్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం కేసీఆర్ ను ఎంతో గౌరవంతో, హుందాతనంతో కలుస్తుంటారని వివరించారు.