Hyderabad: హైదరాబాదులో మరో 261 మందికి కరోనా

Hyderabad registers 261 corona cases in a single day
  • గత 24 గంటల్లో 26,976 కరోనా పరీక్షలు
  • తెలంగాణలో 516 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 434 మంది
  • ఇంకా 4,784 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,976 కరోనా పరీక్షలు నిర్వహించగా, 516 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 261 కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా హైదరాబాదు జిల్లాలో 250కి పైన రోజువారీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో 43, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43, మంచిర్యాల జిల్లాలో 34, సంగారెడ్డి జిల్లాలో 24 కేసులు గుర్తించారు. అదే సమయంలో 434 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు. 

ఇప్పటిదాకా కరోనాతో మొత్తం 4,111 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 8,01,922 మంది కరోనా బారినపడగా.... 7,93,027 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,784 మంది చికిత్స పొందుతున్నారు.
Hyderabad
Corona Virus
New Cases
Telangana

More Telugu News