తెలంగాణలో మరో 462 మందికి కరోనా
- గత 24 గంటల్లో 25,518 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 259 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 403 మంది
- ఇంకా 4,702 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,01,406 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,92,593 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,702 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
