మోకాళ్ల నొప్పులకు నాటు వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్న ధోనీ
- ఇటీవల ధోనీ రెండు మోకాళ్లలో నొప్పులు
- రాంచీలో వందన్ సింగ్ వద్ద చికిత్స
- ధోనీ ఎవరో తెలియకుండానే చికిత్స చేసిన వందన్ సింగ్
కాగా, తన వద్దకు వచ్చిన ధోనీతో పాలతో కొన్ని వనమూలికలు కలుపుకుని తాగాలని వందన్ సింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ధోనీ గురించి ఏమీ తెలియకుండానే వందన్ సింగ్ వైద్యం చేశాడు. ఇటీవల చాలామంది చెప్పడంతో ధోనీ పెద్ద క్రికెటర్ అని తెలిసిందట. రాంచీ పరిసర ప్రాంతాల్లో వందన్ సింగ్ మూలికావైద్యానికి ఎంతో పేరుంది. ధోనీ తల్లిదండ్రులు కూడా ఆయన వద్దకే వచ్చి వైద్యం చేయించుకుంటారట.
