Allari Naresh: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీ టీజర్ రిలీజ్!

  • అల్లరి నరేశ్ నుంచి మరో విభిన్న చిత్రం 
  • మారేడుమిల్లి నేపథ్యంలో నడిచే కథ 
  • దర్శకుడిగా రాజ్ మోహన్ పరిచయం 
  • ఈ నెల 30వ తేదీన  టీజర్ రిలీజ్
Itlu Maredumilli Prajaneekam pre teaser release

అల్లరి నరేశ్ కథానాయకుడిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా రూపొందింది. మారేడుమిల్లి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నరేశ్ సరసన నాయికగా ఆనంది అలరించనుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి రాజ్ మోహన్ దర్శకత్వం వహించగా, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు.    

విభిన్నమైన కథాకథనాలతో .. సహజత్వానికి దగ్గరగా ఈ కథ నడుస్తుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. మారేడుమిల్లి అడవీ ప్రాంతంలో 55 రోజుల పాటు షూటింగ్ చేశామనీ  .. 250 మంది ఈ సినిమా కోసం అడవుల్లో పని చేశారని చెప్పారు. 

ఈ సినిమా కోసం మారేడుమిల్లిలో ఇంతవరకూ ఎవరూ షూట్ చేయని 22 లొకేషన్స్ లో తాము షూటింగ్ చేశామని అన్నారు. ఉదయాన్నే 3 గంటలకు లేచి నడక మొదలుపెట్టేసి లొకేషన్స్ కి తాము ఎంత కష్టపడి చేరుకున్నది చూపించారు. మారేడుమిల్లి ఫారెస్టులో  టీమ్  తీసుకున్న రిస్క్ కి సంబంధించిన విజువల్స్ పై ఈ టీజర్ కట్ చేశారు. పూర్తి టీజర్ ను ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. 

More Telugu News