హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్... రైతుల ఖాతాల్లో కౌలు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- కౌలు కోసం హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్
- మంగళవారం పిటిషన్పై విచారణ చేపట్టనున్న హైకోర్టు
- సోమవారమే కౌలు నిధులను విడుదల చేసిన సీఆర్డీఏ
గతంలోనూ తమ పొలాలకు సంబంధించి కౌలు నిధుల విడుదల కోసం అమరావతి రైతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాడు కూడా తక్షణమే రైతుల ఖాతాల్లో కౌలు నిధులను జమ చేయాలంటూ సీఆర్డీఏ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాటి తీర్పు నేపథ్యంలో ఈ దఫా కూడా రైతుల పిటిషన్పై హైకోర్టు విచారణకు ఒక రోజు ముందుగా రైతుల ఖాతాల్లో సీఆర్డీఏ కౌలు నిధులను జమ చేయడం గమనార్హం.