తెలుగులో బోర్డు పెట్టుకుంటే నాకు సుప్రీంకోర్టు సీజే పదవి రాదన్నారు.. అయినా దానికి సిద్ధపడ్డా!: జస్టిస్ ఎన్వీ రమణ
27-06-2022 Mon 10:20 | Both States
- తెలుగు వాళ్లు ఎక్కడికి వెళ్లినా తెలుగులోనే మాట్లాడుకోవాలన్న సీజే
- మట్టివాసనను, మాతృభాషను, తల్లిదండ్రులను మరవొద్దని సూచన
- వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయుల ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్వీ రమణ

తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డా తెలుగులోనే మాట్లాడుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. పిల్లలకు మాతృభాష, ప్రథమ భాషగా తెలుగులో విద్యాబోధన సాగాలన్నారు. తెలుగులో ఉత్తరాలు రాసే సంప్రదాయాన్ని కొనసాగించాలని సూచించారు. నేను తెలుగు వాడిని అని సగర్వంగా చెప్పే పరిస్థితి తెచ్చుకోవాలన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రమణ.. వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
తెలుగువారు ఏ దేశానికి వెళ్లినా తమ మూలాలను, మాతృ భాషను, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోవద్దని కోరారు. పుట్టిన మట్టి వాసనను, తల్లిదండ్రులను మరవొద్దని ప్రవాస భారతీయులకు సూచించారు. బంధుమిత్రులు, విద్య నేర్పిన గురువులను ఏడాదికి ఒక్కసారైనా స్వయంగా కలిసి మాట్లాడితే లభించే సంతృప్తి వేరుగా ఉంటుందన్నారు.
ప్రతి తెలుగు వ్యక్తి తన మాతృభాష తెలుగు అని గర్వంగా చెప్పుకోవాలని సూచించారు. ఢిల్లీలో తనకు ఎదురైన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఢిల్లీలో తన బంగ్లాకు తెలుగులో నామ ఫలకం పెట్టమని అడిగితే సిబ్బంది అవి లేవన్నారని చెప్పారు. విషయం తెలుసుకున్న ఓ కాంగ్రెస్ మంత్రి తెలుగులో ఓ బోర్డు రాయించి పంపించారని వెల్లడించారు.
అయితే, ఓ రోజు తన ఇంటికి వచ్చిన సుప్రీం సీనియర్ న్యాయమూర్తి ఒకరు తెలుగులో బోర్డు ఉండటం మంచిది కాదు తీసేయమని చెప్పారని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాలంటే ఇలా చేయడం మంచిది కాదంటూ సలహా ఇచ్చారని, తాను మాత్రం రాజీ పడలేదన్నారు. మాతృ భాషలో నామ ఫలకం ఉన్నంత మాత్రాన ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కదంటే అందుకు తాను సిద్ధపడ్డానని ఎన్వీ రమణ వెల్లడించారు. ఇప్పుడు కూడా తన నివాసం ముందు ఇంగిష్ తో పాటు తెలుగు భాషలో కూడా తన పేరు రాసి ఉంటుందని చెప్పారు.
తెలుగువారు ఏ దేశానికి వెళ్లినా తమ మూలాలను, మాతృ భాషను, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోవద్దని కోరారు. పుట్టిన మట్టి వాసనను, తల్లిదండ్రులను మరవొద్దని ప్రవాస భారతీయులకు సూచించారు. బంధుమిత్రులు, విద్య నేర్పిన గురువులను ఏడాదికి ఒక్కసారైనా స్వయంగా కలిసి మాట్లాడితే లభించే సంతృప్తి వేరుగా ఉంటుందన్నారు.
ప్రతి తెలుగు వ్యక్తి తన మాతృభాష తెలుగు అని గర్వంగా చెప్పుకోవాలని సూచించారు. ఢిల్లీలో తనకు ఎదురైన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఢిల్లీలో తన బంగ్లాకు తెలుగులో నామ ఫలకం పెట్టమని అడిగితే సిబ్బంది అవి లేవన్నారని చెప్పారు. విషయం తెలుసుకున్న ఓ కాంగ్రెస్ మంత్రి తెలుగులో ఓ బోర్డు రాయించి పంపించారని వెల్లడించారు.
అయితే, ఓ రోజు తన ఇంటికి వచ్చిన సుప్రీం సీనియర్ న్యాయమూర్తి ఒకరు తెలుగులో బోర్డు ఉండటం మంచిది కాదు తీసేయమని చెప్పారని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాలంటే ఇలా చేయడం మంచిది కాదంటూ సలహా ఇచ్చారని, తాను మాత్రం రాజీ పడలేదన్నారు. మాతృ భాషలో నామ ఫలకం ఉన్నంత మాత్రాన ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కదంటే అందుకు తాను సిద్ధపడ్డానని ఎన్వీ రమణ వెల్లడించారు. ఇప్పుడు కూడా తన నివాసం ముందు ఇంగిష్ తో పాటు తెలుగు భాషలో కూడా తన పేరు రాసి ఉంటుందని చెప్పారు.
Advertisement lz
More Telugu News

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా
2 minutes ago

'అమిగోస్' నుంచి బాలయ్య హిట్ సాంగ్ రీమిక్స్!
2 hours ago

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
3 hours ago

తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ
3 hours ago

తిరుమల మాడవీధుల్లో సీఎంవో స్టిక్కర్ ఉన్న వాహనం
3 hours ago

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్
3 hours ago




లక్నో స్టేడియం క్యురేటర్ పై వేటు
4 hours ago

చావైనా, బతుకైనా ధర్మం కోసమే పోరాడతా: రాజాసింగ్
4 hours ago

టాప్-10 కుబేరుల్లో చోటు కోల్పోయిన గౌతమ్ అదానీ
4 hours ago

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క
5 hours ago

ప్యూర్ ఈవీ నుంచి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్
5 hours ago

అందాల మందారం .. ఆషిక రంగనాథ్: లేటెస్ట్ పిక్స్!
5 hours ago

పీఎఫ్ నామినీ వివరాలు ఇలా మార్చుకోవచ్చు..!
6 hours ago

Advertisement
Video News

Watch: President Draupadi Murmu's maiden speech in Parliament
31 minutes ago
Advertisement 36

Undavalli Arun Kumar's key comments on AP capital
56 minutes ago

Watch: Rahul Gandhi, sister Priyanka visit Kheer Bhawani temple, Hazratbal shrine
1 hour ago

Live: CM Jagan addressing at Global Investors Summit in Delhi
1 hour ago

'Enno Ratrulosthayi' video song from Amigos is a visual feast- Kalyan Ram, Ashika
2 hours ago

YCP MLA Anam sensational comments on phone tapping
2 hours ago

Bhogapuram Airport: Locals concern on immediate evacuation
2 hours ago

Shiva Vedha Telugu trailer featuring Dr. Shivarajkumar
3 hours ago

AP Capital shift to Vizag before April, says TTD Chairman YV Subba Reddy:
3 hours ago

Kotamreddy Sridhar Reddy's audio leaked; says he will contest on TDP's ticket in next elections
4 hours ago

Unruly Italian woman flyer arrested on Vistara Flight after assaulting crew
4 hours ago

BJP MLA Raja Singh gets another show-cause notice from Mangalhat Police Station
5 hours ago

Nara Lokesh clears traffic for ambulance during Yuvagalam padayatra
5 hours ago

Nagababu supports struggling actress Pakeezah with financial aid
5 hours ago

I will make future capital Visakhapatnam my residence: AP CM YS Jagan
5 hours ago

Tollywood actress Kajal Aggarwal visits Tirumala temple with son Neil
6 hours ago