చరిత్ర సృష్టించిన తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ
- ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్3 లో స్వర్ణం, రజతం
- మిక్స్ డ్ కాంపౌండ్ విభాగంలో భారత్ కు తొలి స్వర్ణం అందించిన ఆర్చర్లుగా జ్యోతి, అభిషేక్ రికార్డు
- వ్యక్తిగత విభాగంలో రజతం గెలిచిన విజయవాడ అమ్మాయి
ఇక, కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ రజతం సొంతం చేసుకుంది. ఆమె కొద్దిలో స్వర్ణం చేజార్చుకుంది. ఎల్లా గిబ్సన్ (బ్రిటన్)తో జరిగిన ఫైనల్లో జ్యోతి తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 148–148తో సమంగా నిలిచారు. అనంతరం విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ చెరో షాట్తో షూటాఫ్ నిర్వహించారు. ఇందులో కూడా గిబ్సన్, జ్యోతి సురేఖ ఇద్దరూ 10 పాయింట్లు సాధించారు. అయితే గిబ్సన్ బాణం 10 పాయింట్ల వృత్తం లోపల ఉండగా... సురేఖ వృత్తం అంచున తగిలింది. దాంతో గిబ్సన్కు స్వర్ణం, సురేఖకు రజతం లభించాయి.
కాగా, ఆర్చరీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న జ్యోతి సురేఖకు గ్రూప్1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ ఈ మధ్యే ఆమోదం తెలిపింది.