తెలుగు వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటే సంతోషించే వాళ్లమనడంలో సందేహం లేదు: జీవీఎల్ నరసింహారావు
- ద్రౌపది ముర్ము గొప్ప మహిళ అని కొనియాడిన జీవీఎల్
- ప్రతిపక్షాలు కూడా ఆమెకు మద్దతు పలుకుతున్నాయని వ్యాఖ్య
- గత మూడు దశాబ్దాలలో ఇంత సానుకూల వాతావరణం ఎప్పుడూ లేదన్న జీవీఎల్
మరోవైపు ద్రౌపది ముర్ముపై జీవీఎల్ ప్రశంసలు కురిపించారు. కౌన్సిలర్ గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్ గా సుశిక్షితురాలైన ఆదివాసీ మహిళ ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో సర్వత్ర పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. దేశానికే వన్నె తెచ్చే గొప్ప మహిళ ఆమె అని కొనియాడారు. ప్రతిపక్షాలు సైతం ఆమెకు మద్దతిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై దేశ వ్యాప్తంగా ఇంత సానుకూల వాతావరణం నెలకొనడం గత మూడు దశాబ్దాలలో తానెప్పుడూ చూడలేదని అన్నారు.