వరద విలయంలో అసోం... రూ.25 కోట్లు అందించిన ముఖేశ్ అంబానీ
- అసోంలో ఎడతెరిపి లేని వర్షాలు
- వరదల్లో చిక్కుకున్న మెజారిటీ ప్రాంతాలు
- అసోం సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.25 కోట్లు ఇచ్చిన ముఖేశ్, అనంత్ అంబానీలు
- ధన్యవాదాలు తెలుపుతూ అసోం సీఎం ట్వీట్
ఇలాంటి పరిస్థితుల్లో అసోం ప్రభుత్వం అడగకుండానే దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీలు ఏకంగా రూ.25 కోట్లను అసోం సీఎం రిలీఫ్ ఫండ్కు అందించారు. ఈ సాయాన్ని కొనియాడుతూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ శుక్రవారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ముఖేశ్, అనంత్ల సాయానికి రుణపడి ఉన్నామని, కష్టకాలంలో ఆదుకున్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ సదరు ట్వీట్లో హిమంత పేర్కొన్నారు.