సింగరేణిలో ఉద్యోగ నోటిఫికేషన్.. ఎవరెవరు అర్హులంటే..!
- 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- దరఖాస్తులకు జులై 10వ తేదీ ఆఖరు
- రాత పరీక్ష ద్వారా ఎంపిక
అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఈ ఉద్యోగాలను ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ. 29, 460 పే స్కేల్ తో వేతనం లభిస్తుంది. జనరల్ రూ. 400, ఎస్సీ, ఎస్టీ, సింగరేణి ఉద్యోగుల పిల్లలు రూ. 100తో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు సింగరేణి వెబ్సైట్ https://scclmines.com/ చూడవచ్చు.