అగ్నిపథ్ ఎఫెక్ట్.. విశాఖపట్టణం రైల్వే స్టేషన్ మూత
- స్టేషన్లోకి ఎవరూ రాకుండా చర్యలు
- అర కిలోమీటరు ముందే బారికేడ్లు
- విజయవాడ మీదుగా వచ్చే రైళ్లను దువ్వాడ వద్ద..
- హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస వద్ద నిలిపివేత
- రైళ్లన్నీ దారిమళ్లింపు
కాగా, ఇప్పటికే బయలుదేరి విజయవాడ మీదుగా విశాఖపట్టణం చేరుకోవాల్సిన రైళ్లను దువ్వాడ వద్ద, హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస వద్ద నిలిపివేసి దారి మళ్లిస్తామని అధికారులు తెలిపారు.
రైళ్లు విశాఖ రాకుండా చర్యలు తీసుకున్న అధికారులు.. స్టేషన్కు అర కిలోమీటరు ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి స్టేషన్లోకి ఎవరూ చొరబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఉదయం ఏడు గంటల వరకు ఉన్న ప్రయాణికులను మాత్రం తనిఖీల అనంతరం స్టేషన్లోకి అనుమతించారు. స్టేషన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.