సికింద్రాబాద్ అల్లర్లతో మాకు సంబంధం లేదు: ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లు
- పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి
- ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే పనులు కాంగ్రెస్ చేయదన్న వెంకట్
ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే పనులను కాంగ్రెస్ పార్టీ చేయదని వెంకట్ తెలిపారు. ఈ ఉదయం తాను ఒక టీవీ ఛానల్ డిబేట్ కు వెళ్తుండగా పోలీసులు తనను అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారని చెప్పారు. అక్కడి నుంచి షా ఇనాయత్ గంజ్ పీఎస్ కు తీసుకొచ్చారని తెలిపారు. అందుకే పోలీస్ స్టేషన్ నుంచే తాను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని చెప్పారు.