అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ షర్మిలకు రేవంత్ రెడ్డి ఫోన్
- రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం
- భేటీ ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
- నేతలను స్వయంగా ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి
'బచావో హైదరాబాద్' పేరిట కాంగ్రెస్ పార్టీ రేపు (జూన్ 15) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. హైదరాబాదులో శాంతిభద్రతలు క్షీణిస్తున్నట్టు ఇటీవల జరిగిన ఘటనలు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే, రేపు ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించలేదు.