ఏపీ సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం పదవీకాలం పొడిగింపు
- జూన్ 3తో ముగిసిన అజేయ కల్లం పదవీ కాలం
- జూన్ 4 నుంచి ఏడాది కాలం పాటు పదవీ కాలం పొడిగింపు
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
2019లో అధికారంలోకి వచ్చాక.. విశ్రాంత ఐఏఎస్ అజేయ కల్లంను ముఖ్యమంత్రి జగన్ తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. ఈ పదవితో పాటు జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం స్టీరింగ్ కమిటీ చైర్మన్గానూ అజేయ కల్లం వ్యవహరిస్తున్నారు.