KCR: సీఎం కేసీఆర్‌కు దీదీ ఫోన్‌.. 15న ఢిల్లీ స‌మావేశానికి రావాల‌ని ఆహ్వానం

west bengal cm mamata benerjee invites kcr to delhi meeting
  • ఈ నెల 15న ఢిల్లీలో తృణ‌మూల్ జాతీయ స్థాయి స‌మావేశం
  • త్వరలో జరగనున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌పై చ‌ర్చించే అవ‌కాశం
  • వివిధ పార్టీల‌కు చెందిన 22 మంది నేత‌ల‌కు దీదీ ఆహ్వానం
  • కేసీఆర్‌కు స్వ‌యంగా ఫోన్ చేసిన దీదీ
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ శ‌నివారం ఫోన్ చేశారు. ఈ నెల 15న ఢిల్లీలో ప‌లు రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో తృణ‌మూల్ కాంగ్రెస్ నిర్వ‌హించ‌నున్న స‌మావేశానికి రావాలంటూ ఈ సందర్భంగా కేసీఆర్‌ను దీదీ ఆహ్వానించారు. 

జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో తృణ‌మూల్ కాంగ్రెస్‌ కీల‌క భూమిక పోషించే దిశ‌గా మ‌మ‌తా బెన‌ర్జీ వ్యూహాలు ర‌చిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలో నిర్వ‌హించ‌నున్న స‌మావేశానికి రావాలంటూ ప‌లు పార్టీల‌కు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేత‌ల‌కు దీదీ ఆహ్వానాలు పంపారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌కు దీదీ ఫోన్ చేశారు.


KCR
TRS
Telangana
Mamata Banerjee
Trinamool Congress
West Bengal

More Telugu News