Gouthu Sireesha: నేరం చేసిన‌ట్లు ఒప్పుకోమంటే కుద‌ర‌దన్నాను: సీఐడీ విచార‌ణ‌పై గౌతు శిరీష‌

  • 7 గంట‌ల పాటు శిరీష‌ను ప్రశ్నించిన సీఐడీ
  • మ‌ధ్యాహ్నం భోజ‌నం కూడా పెట్ట‌లేద‌న్న శిరీష‌
  • న్యాయ‌వాదిని కూడా అనుమ‌తించ‌లేద‌ని వెల్లడి   
tdp leader gouthu sireesha comments on cid investigation

సోష‌ల్ మీడియాలో పోస్టుల కేసులో టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ గౌతు శిరీష‌ను సీఐడీ అధికారులు సోమ‌వారం దాదాపుగా 7 గంట‌ల పాటు విచారించారు. మంగ‌ళ‌గిరి ప‌రిధిలోని డీజీపీ కార్యాల‌యంలోని సీఐడీ విభాగంలో జ‌రిగిన ఈ విచార‌ణ ముగిసిన అనంత‌రం డీజీపీ కార్యాల‌యం బ‌య‌ట త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా శిరీష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ కేసులో నేరం ఒప్పుకోవాలంటూ సీఐడీ అధికారులు త‌న‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని చెప్పిన శిరీష... అందుకు తాను స‌సేమిరా ఒప్పుకోలేద‌ని వెల్ల‌డించారు. ఈ కేసును న్యాయ‌ప‌రంగానే తాను ఎదు‌ర్కొంటాన‌ని సీఐడీ అధికారుల‌కు చెప్పిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. అంతేకాకుండా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాలంటూ తానెవ‌రికీ చెప్ప‌లేద‌ని కూడా తెలిపాన‌న్నారు.

ఇక విచార‌ణ‌లో భాగంగా సీఐడీ అధికారులు త‌న‌ను ఇబ్బందిపెట్టార‌ని ఆమె ఆరోపించారు. 7 గంట‌ల పాటు విచార‌ణ సాగ‌గా... మ‌ధ్యాహ్నం వేళ త‌న‌కు క‌నీసం భోజ‌నం కూడా పెట్ట‌లేద‌ని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా విచార‌ణ సంద‌ర్భంగా త‌న న్యాయ‌వాది ఉండడానికి కూడా సీఐడీ అధికారు‌లు ఒప్పుకోలేద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

More Telugu News