డీజీపీ కార్యాలయంలో గౌతు శిరీష.. 3 గంటలకు పైగా విచారిస్తున్న సీఐడీ
- సోషల్ మీడియాలో పోస్టులపై శిరీషకు సీఐడీ నోటీసులు
- డీజీపీ కార్యాయం, సీఐడీ విభాగంలో విచారణకు హాజరు
- మధ్యాహ్నం 12 గంటల నుంచి జరుగుతున్న విచారణ
ప్రస్తుతం మంగళగిరి పరిధిలోని డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగంలో గౌతు శిరీషను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మొదలైన ఈ విచారణ 3 గంటలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఈ విచారణలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, వాటి నేపథ్యం తదితరాలపై ఆమెను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం.