గుజరాత్ ప్రజలకు ప్రత్యామ్నాయం మేమే.. 182 స్థానాల నుంచి బరిలోకి: ఆప్
- పంజాబ్లో ఘన విజయంతో ఊపులో ఉన్న ‘ఆప్’
- గుజరాత్ ప్రజలకు ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చిందన్న మనీశ్ సిసోడియా
- ఇక ప్రజలే నిర్ణయించుకోవాలన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం
గుజరాత్ ప్రజలకు ఇప్పటి వరకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని, ఇప్పుడు తాము ప్రత్యామ్నాయంగా మారబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 182 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చిందని, ఇక ఓటు ఎవరికి వేయాలో వారే నిర్ణయించుకోవాలని సిసోడియా అన్నారు.