ఆత్మగౌరవ దీక్షను చేపడుతున్న కోదండరామ్
- ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారన్న కోదండరామ్
- తెలంగాణ మరో శ్రీలంక అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్య
- కేసీఆర్ పాలనలో ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయారన్న ప్రొఫెసర్
కేసీఆర్ విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఆత్మగౌరవ దీక్షను చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. వరంగల్ లో 24 వేల ఎకరాల భూమిని అమ్మేందుకు ప్రభుత్వం యత్నిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందని.. దీంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుందని అన్నారు.