KTR: ఇది దుర్మార్గమైన ఘటన... నిందితులు ఎవరైనా సరే వదలొద్దు: మంత్రి కేటీఆర్

  • జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం
  • దిగ్భ్రాంతికి గురయ్యానన్న కేటీఆర్
  • కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రికి విజ్ఞప్తి
KTR tweets on Jubille Hills incident

హైదరాబాదులో ఓ మైనర్ బాలికపై దారుణం జరగడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను కోరారు. అది అత్యంత హేయమైన ఘటన అని, నిందితులు ఎవరైనా, ఎవరితో సంబంధాలు ఉన్నా సరే ఉపేక్షించరాదని కేటీఆర్ స్పష్టం చేశారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News